
నటి కరాటే కల్యాణి.. యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ఎంత టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరోసారి నటి కల్యాణి వార్తల్లో నిలిచారు. ఎఆర్ నగర్ పరిధిలోని రాజీవ్ నగర్ లో ఉంటున్నఆమె ఇంటికి ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు వెళ్లారు. ఇటీవలే ఓ చిన్నారని దత్తత తీసుకుందని.. అయితే.. అక్రమంగా..ఆ చిన్నారని తెచ్చుకున్నారని ఫిర్యాదు వచ్చిందని అధికారులు తెలిపారు. చిన్నారి వివరాలను ఆరా తీస్తున్నారు. అయితే.. అధికారులు వచ్చిన సమయంలో నటి కరాటే కల్యాణి ఇంట్లో లేకపోవడం గమనార్హం. చిన్నారి కూడా లేదని తెలుస్తోంది. చట్ట ప్రకారమే చిన్నారని తెచ్చుకున్నామని నటి కరాటే కల్యాణి తల్లి మీడియాకు తెలిపారు.
దీనిపై ఛైల్డ్ వెల్ఫేర్ కు చెందిన అధికారి v6తో మాట్లాడారు. నటి కరాటే కల్యాణి ఇంటికి అక్రమంగా చిన్నారని తెచ్చుకున్నారని తమకు సమాచారం వచ్చిందని..దీనిని తమ కో ఆర్డినేటర్ కు తెలియచేయడం జరిగిందన్నారు. తాము ఎస్ఆర్ నగర్ పోలీసుల సహకారంతో ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఇంట్లో 11 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడని చెబుతున్నారని, ఆమె సంగారెడ్డి టెంపుల్ కు వెళ్లిందని కుటుంబసభ్యులు తెలియచేయడం జరిగిందన్నారు.
ఆమెకు ఫోన్ చేయగా..స్విచాప్ వస్తోందన్నారు. ముగ్గురు అమ్మాయిలున్నారని.. పెంచి పోషించలేని పరిస్థితుల్లో వాళ్లు తమకు చిన్నారని ఇవ్వడం జరిగిందని కరాటే కళ్యాణి కుటుంబసభ్యులు చెబుతున్నారని వెల్లడించారు. పిల్లలను పెంచాలనే తపన కరాటే కల్యాణిలో ఉందంటున్నారని ఆ అధికారి తెలిపారు. మరి నటి కరాటే కల్యాణి ఎలా స్పందిస్తారో చూడాలి.