ఆసక్తి ఉన్న రంగాల్లో పిల్లలను ప్రోత్సహించాలి : తలసాని

ఆసక్తి ఉన్న రంగాల్లో పిల్లలను ప్రోత్సహించాలి :  తలసాని

సికింద్రాబాద్​, వెలుగు: చిన్నతనం పిల్లలకు ఆసక్తి కలిగిన రంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈనెల16న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జెక్ కాలనీకి చెందిన గుంటూరు మోక్షిక, రిత్విక్, సిల్వర్ మెడల్ సాధించిన మోక్షిత, కార్తీక్, లియోనా, శ్రీయాన్ ఇతర మెడల్స్ సాధించిన చిన్నారులను ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఆయన ఇంట్లో అభినందించారు. ప్రతి వ్యక్తికి  చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని, క్రీడలతో శారీరక  దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, స్పోర్టీవ్​ నెస్​పెరుగుతుందన్నారు.మంచి క్రీడాకారులుగా జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ర్టానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.