పీసీసీ అవమానించింది..అయినా కాంగ్రెస్​లోనే కొనసాగుతా : చిన్నారెడ్డి

పీసీసీ అవమానించింది..అయినా కాంగ్రెస్​లోనే కొనసాగుతా : చిన్నారెడ్డి
  • పీసీసీ అవమానించింది..అయినా కాంగ్రెస్​లోనే కొనసాగుతా..
  • నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం అందుబాటులో ఉంటా..
  • మాజీ మంత్రి చిన్నారెడ్డి  

వనపర్తి, వెలుగు : తన టికెట్ మరొకరికి ఇచ్చి పీసీసీ అవమానించిందని, అయినా తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని మాజీ మంత్రి చిన్నారెడ్డి స్పష్టం చేశారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో తన అనుచరులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తిలో తనను నమ్ముకున్న కార్యకర్తలకు తాను, తన కొడుకు డాక్టర్ జిల్లెల ఆదిత్య అందుబాటులో ఉంటామన్నారు. 

వారిని అన్నివేళలా కంటికిరెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తలు మనో నిబ్బరంతో ఉండాలన్నారు. మేఘారెడ్డి పార్టీలోని కార్యకర్తలను అవమానిస్తే తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, నాయకులు సత్యారెడ్డి, రామారావు, కిరణ్ కుమార్, కోట్ల రవి  పాల్గొన్నారు.