చిరంజీవి ప్రొడ్యూసర్ మృతి

 చిరంజీవి ప్రొడ్యూసర్ మృతి

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొన్నాయి. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించిన ప్రొడ్యూసర్ ముఖేష్ ఉద్దేశి(Mukesh Udeshi). ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ.. చెన్నైలో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ముఖేష్ ఉద్దేశికు కిడ్నీ ఆపరేషన్ నిర్వహించుటకు అల్లు అరవింద్ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ..మృతి చెందడం ఇండిస్టీ మొత్తాన్ని కలచివేస్తోంది. ముకేశ్‌ మృతిపై పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

 చిరంజీవి(Chiranjeevi) హీరోగా హిందీలో నటించిన ప్రతిబంధ్, తెలుగులో ఎస్పీ పరుశురాం మూవీస్ని ముఖేష్ ఉద్దేశి నిర్మించి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత అల్లు అరవింద్తో కలిసి పలు మూవీస్ ను ముఖేష్ నిర్మించారు. గో గోవా డాన్, ద విలన్, కౌన్‌, ఏక్‌ విలన్‌, సారీ భాయ్, కిడ్నాప్, ప్యార్ మైన్ ట్విస్ట్,  వంటి ఫేమస్ మూవీస్ ని నిర్మించారు. ఇక ముఖేష్ ఉద్దేశికి  భార్య,కుమారుడు ఉన్నారు.