సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి.. ప్రస్తుతం ‘భోళా శంకర్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఇంకా నెల రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు ప్రచారం జరుగుతున్నాయి.
ఇందులో ఎలాంటి స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఉండవట. అయితే ‘చూడాలని ఉంది’ చిత్రంలోని ‘రామ్మా చిలకమ్మ’ సాంగ్ను రీమిక్స్ చేయబోతున్నట్టు వినిపిస్తోంది. ఇక ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్ అవుతుందనే న్యూస్ ప్రచారంలో ఉంది. చిరంజీవి నటిస్తోన్న 154వ చిత్రమిది. తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.