- పెళ్లి రద్దుతో మనస్తాపానికి గురైన సుష్మా
చిత్తూరు: జిల్లాకు చెందిన సుష్మా అనే యువతి అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. అమెరికాలోని డల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న సుష్మాకు చిత్తూరు జిల్లాకు చెందిన భరత్ అనే యువకుడితో జరగాల్సిన పెళ్లి రద్దు కావడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఇవాళ చిత్తూరులో పెళ్లి జరగాల్సి ఉండగా భరత్ కుటుంబీకులు ససేమిరా అనడంతో వివాహం రద్దు అయింది. తన పెళ్లి రద్దు కావడంతో సుష్మా మూడు రోజులుగా తీవ్రంగా మనోవేదనకు గురైంది. అమెరికాలోని తన ఇంట్లో ఇవాళ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. సుష్మా మృతదేహం ఇండియాకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల్లో ఇండియాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భరత్ కుటుంబీకులపై సుష్మా బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
బదిలీల్లో స్పౌస్ కేటగిరీని దుర్వినియోగం చేసిన టీచర్లు
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప.. క్యాచ్ అందుకున్న డెలివరీ బాయ్