విశాఖ బీచ్ రోడ్డులో సినీ ప్రముఖుల విగ్రహాల తొలగింపు

విశాఖ బీచ్ రోడ్డులో సినీ ప్రముఖుల విగ్రహాల తొలగింపు

విశాఖ బీచ్ రోడ్ లో గత అర్ధరాత్రి  ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీచ్ రోడ్ లో ప్రముఖుల విగ్రహాల పక్కన ఏర్పాటు చేసిన సినీ నటులు అక్కినేని నాగేశ్వర రావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ ల విగ్రహాలను జీవిఎంసీ అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారన్న కారణంగా అధికారులు అక్కడి నుంచి విగ్రహాలను తరలించారు. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు ఆందోళ‌నకు దిగ‌టంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితి త‌లెత్తింది.

అధికారులు మాత్రం.. తాము న‌గ‌ర పాలక సంస్థ‌ల నిబంధ‌ల‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న విగ్ర‌హాల‌నే తొలిగించామ‌ని..దీని పైన కోర్టు ఉత్త‌ర్వులు ఉన్నాయ‌ని  స్ప‌ష్టం చేసారు. భారీ బందోబస్తు నడుమ అధికారులు వీటిని తొలగించారు.