త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తా

త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తా

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్య పాలన అవసరం ఉందన్నారు వైఎస్ షర్మిల. కొత్త పార్టీ గురించి ఆమె మంగళవారం లోటస్ ఫండ్ లో మాట్లాడుతూ..అన్ని జిల్లాల నేతల అభిప్రాయం తీసుకుంటున్నానని..సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని..మంగళవారం నల్గొండ జిల్లా నాయకుల అభిప్రాయం తీసుకున్నట్లు చెప్పారు.

జిల్లా నేతల నుంచి మంచి స్పందన వచ్చిందని.. రాబోయే సమావేశాలు జిల్లాలోనే ఉంటాయన్నారు. నల్గొండ ఉపఎన్నికల్లో పోటీ చేయమని తెలిపిన షర్మిల.. జగన్మోహన్ రెడ్డి నేను వేరు కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పని ఆయనది నా పని నాది అన్నారు. పాదయాత్రపై స్పందించని వైఎస్ షర్మిల..పార్టీ పెట్టడంపై, త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానన్నారు.