మహబూబాబాద్ జిల్లా నీలంపల్లిలో ఉద్రిక్తత

మహబూబాబాద్ జిల్లా నీలంపల్లిలో ఉద్రిక్తత

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ట్రెంచ్ కొట్టడంపై పోడు రైతులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఏళ్లుగా సాగుచేస్తున్న భూముల్లో అటవీ అధికారులు... ట్రెంచ్ పనులు మొదలు పెట్టారు. తమ భూముల్లో చెట్ల కోసం గుంతలు తీయవద్దంటూ అడ్డుకోవటానికి వెళ్లారు మహిళా రైతులు. దీంతో మహిళా రైతులను అడ్డుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అయితే అధికారుల తీరుపై మండిపడుతున్నారు పోడు రైతులు. భారీ భద్రత మధ్య....ట్రెంచ్ కొడుతున్నారు అధికారులు.