జేఎన్‌‌యూలో ABVP, AISA మధ్య గొడవ

జేఎన్‌‌యూలో ABVP, AISA మధ్య గొడవ
  • ఆర్టికల్‌‌ 370పై సెమినార్‌‌‌‌లో వాగ్వాదం

న్యూఢిల్లీ: జవహర్‌‌‌‌ లాల్‌‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌‌యూ) న్యూఢిల్లీలో ఏబీవీపీ, ఏఐఎస్‌‌ఏ స్టూడెంట్స్‌‌ మధ్య గురువారం గొడవ జరిగింది. జమ్మూకాశ్మీర్‌‌‌‌లో ఆర్టికల్‌‌ 370 రద్దు అంశంపై సెమినార్‌‌‌‌ జరుగుతుండగా గొడవ జరిగిందని పోలీసులు చెప్పారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్‌‌‌‌కు కేంద్ర మంత్రి జితేందర్‌‌‌‌ సింగ్‌‌ అతిథిగా వచ్చారు. జితేందర్‌‌‌‌ మాట్లాడుతుండగా  ఏఐఎస్‌‌ఏ స్టూడెంట్స్‌‌ నినాదాలు చేశారు. ఏబీవీపీకి చెందిన ఇంకొంత మంది కాశ్మీర్‌‌‌‌కు అనుకూలంగా నినాదాలు చేయటంతో గొడవ మొదలైంది.