ఖమ్మం మీటింగ్లో బీఆర్ఎస్కు నిరసన సెగ

ఖమ్మం మీటింగ్లో బీఆర్ఎస్కు నిరసన సెగ

ఖమ్మం పార్లమెంటరీ విస్తృత సమావేశంలో BRSకు నిరసన సెగ తగలింది. వేదిక పైకి ఆహ్వనించకుండా అవమానించారంటూ.. తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమకారులను అవమానించడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందన్నారు. పార్టీ కోసం పనిచేసినవారని పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఖమ్మం జిల్లా BRS అధ్యక్షుడు తాత మధు ఇప్పటికైనా పై పద్ధతి మార్చుకోవాలన్నారు.

ALSO READ :- కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!