ప్రతి ఎకరాకు 20 వేల సాయం చేయాలి

ప్రతి ఎకరాకు 20 వేల సాయం చేయాలి

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ అంచనా వేయలేదని మండిపడ్డారు. పంటలు నష్టపోయిన ఆవేదనలో రైతులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు విపత్తులు వస్తే వెంటనే పంటనష్టం అంచనా వేసి, పరిహారం అందించేవని చెప్పారు. 

భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతం ముంపునకు గురైందని భట్టి విక్రమార్క అన్నారు. పంట నష్టం భారీగా జరిగిందని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.20 వేల సాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.