పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ.. పార్టీ పంజాబ్లో క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలను చీపురు పార్టీ ఊడ్చిపడేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ అధిక్యం లో దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటూతూ.. ఏకంగా 100 స్థానాల అధిక్యం దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మరో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటు సంకేతాలు పంపింది.
ఈ క్రమంలోనే ఆప్ పార్టీ చీఫ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు కలిసి ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పాలనా విధానం నేడు జాతీయ స్థాయికి వెళ్తున్నదని పేర్కొన్నారు మనీష్ సిసోడియా.
Delhi CM and Aam Aadmi Party leader Arvind Kejriwal along with Manish Sisodia and Satyendar Jain offers prayers at Hanuman Temple in Delhi, as AAP sweeps Punjab elections pic.twitter.com/nutoWXwefS
— ANI (@ANI) March 10, 2022