
ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు. ఈవీఎంలు పని చేయక పోవడం, కొన్ని చోట్ల మధ్యాహ్నం వరకూ పోలింగ్ ప్రారంభం కాకపోవడం, అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరపాల్సిన పరిస్థితులపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయనున్నారు.