విజయనగరం సమీపంలో రైలు ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకునేందుకు వీలైనన్ని అం బులెన్సులు పంపాలని.. స్థానిక అధికారులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది వెంటనే స్పాట్ కు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కంటకాపల్లి దగ్గర రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
- ALSO READ | విజయనగరం రైలు ప్రమాదం..హెల్ప్ లైన్ నెంబర్లు