ఏడుపాయల టెంపుల్​కు.. రూ.100 కోట్లు మంజూరు

ఏడుపాయల టెంపుల్​కు.. రూ.100 కోట్లు మంజూరు

మెదక్/పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. గతేడాది సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఏడుపాయల ఆలయానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

కానీ నిధులు మంజూరు చేయలేదు. గత నెల 23న మెదక్ లో కొత్త కలెక్టరేట్ బిల్డింగ్​ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఏడుపాయలకు రూ.100 కోట్లు ఇస్తామని గుర్తుచేశారు. ఇందులో భాగంగా సీఎం స్పెషల్  గ్రాంట్ నుంచి మంగళవారం రూ.100 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.