కొత్త సచివాలయంలో కీలక అంశంపై సీఎం కేసీఆర్ తొలి సమీక్ష..

కొత్త సచివాలయంలో కీలక అంశంపై  సీఎం కేసీఆర్ తొలి సమీక్ష..

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలంయ ప్రారంభమైంది. ఏప్రిల్ 30వ తేదీన అత్యంత వైభవోపేతంగా నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు..మంత్రులు కొన్ని ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి పాలనను ప్రారంభించారు. ఈ క్రమంలోనే కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సమీక్ష జరపబోతున్నారు. మే 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం కీలక అంశంపై మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. 

దేనిపై సమీక్ష..?

పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు, కరివేన, ఉద్దండాపూర్ కాల్వల విస్తరణ పనులతో పాటు ఉద్దండాపూర్ నుంచి తాగునీరు తరలింపు పనులపై కేసీఆర్ సమీక్షించనున్నారు. కొడంగల్, వికారాబాద్ వేళ్లే కాల్వల పనులపై కూడా సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ స‌మావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజ‌రు కానున్నారు.