హైదరాబాద్ : కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారని చెప్పారు. వీరందరికీ వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర అధికారులను సిఎం ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు సిఎం. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో దీనికి సంబంధించి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది.
