నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్

నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని వసంత్ విహార్​లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు కేసీఆర్ ప్రారంభించనున్నారు. పొద్దున వాస్తు పూజతో పాటు సుదర్శన హోమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 గంట లకు కేసీఆర్ పార్టీ ఆఫీస్​కు చేరుకుని పూజ లో పాల్గొంటారు. తర్వాత పార్టీ జెండా ఎగురవేసి కొత్త బిల్డింగ్​లోకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రోగ్రామ్​లో పార్టీ కీలక నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 2021, సెప్టెంబర్ 2న ఆఫీసు నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 11వేల చదరపు అడుగుల స్థలంలో బిల్డింగ్ నిర్మించారు. జీ ప్లస్​3 ఫ్లోర్లు కలిగిన ఈ బిల్డింగ్​లో మొత్తం 20 రూంలు ఉంటాయి. అంతేకాకుండా, స్పెషల్​గా రెండు సూట్​ రూంలు కూడా నిర్మించారు. ఫస్ట్​ ఫ్లోర్​లో కేసీఆర్ ఆఫీస్, ఆయనకు స్పెషల్​ సూట్​ రూం కేటాయించారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం మరో సూట్ రూంను ఏర్పాటు చేశారు.