ఆధార్ మొబైల్ నెంబర్ అనుసంధానానికి సీఎం ఆదేశం

ఆధార్ మొబైల్ నెంబర్ అనుసంధానానికి సీఎం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అందజేయడంతో పాటు ఆధార్ కార్డులను వ్యక్తిగత మొబైల్ నెంబర్ లకు అనుసంధానం చేయాలని సీఎస్​ సోమేశ్ కుమార్ ఆదేశించారు. గురువారం బీఆర్కే భవన్​లో అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏటా 6 లక్షల మంది పుడుతున్నారని, వీరందరికీ వెంటనే ఆధార్ కార్డులను జెనరేట్ చేయాలని సూచించారు. -5 ఏండ్ల లోపు పిల్లలకు ఆధార్ జెనరేట్ చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఆధార్ సీడింగ్ కేంద్రాలు లేని మండలాలన్నింటిలో ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.