వాసాలమర్రి సర్పంచ్ తో సీఎం కేసీఆర్ ఫోన్ సంభాషణ

వాసాలమర్రి సర్పంచ్ తో  సీఎం కేసీఆర్ ఫోన్ సంభాషణ

ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి నుంచి సీఎం ఫాం హౌస్ కు వెళ్లే దారిలో ఈ గ్రామం ఉంది. స్థానికుల భూముల నుంచి యాదాద్రికి రోడ్డు నిర్మాణం చేశారు. అయితే.. దీనిపై గ్రామస్థులు ఆందోళనలు చేశారు. అంతటా విమర్శలు రావడంతో.. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈ ఎనౌన్స్ మెంట్ తర్వాత మొదటిసారి వాసాలమర్రి గ్రామానికి వెళ్తున్నారు. దీనిపై ఇవాళ అక్కడి సర్పంచ్ ఆంజనేయులుతో ఫోన్ లో మాట్లాడారు సీఎం. 22న గ్రామానికి వస్తానని.. అందరం కలిసి భోజనం చేద్దామని.. ఆ తర్వాత గ్రామ సభ పెట్టి ఊళ్లో సమస్యలపై చర్చిద్దామన్నారు కేసీఆర్. కలెక్టర్ వచ్చి అన్ని ఏర్పాట్లు చూస్తారని సీఎం చెప్పారు. సీఎం ఆదేశాలతో.. వాసాలమర్రికి వెళ్లారు కలెక్టర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. సామూహిక భోజనాలు, సభ జరిపేందుకు ఏర్పాట్లను పరిశీలించారు.