మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం

మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం దాదాపు ఖరారైనట్లుగా కనిపిస్తోంది. దాంతో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. హుజుర్‌నగర్ ఎలక్షన్ తర్వాత ఆయన ఎక్కడా సమావేశాల్లో పాల్గొనలేదు. అంతేకాకుండా.. ఆర్టీసీ కార్మికులతో సమావేశం తర్వాత కేసీఆర్ మళ్లీ ఎటువంటి సమావేశం నిర్వహించలేదు. దాంతో నేటి ఆయన మీడియా సమావేశంపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. దాంతో ఆయన నేటి మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

For Municipal Elections Results See Here