ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం?

ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం?

యూపీఏ మీద నిందలు మోపి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చింది. బీజేపీని నమ్మి ఓటేసినందుకు ప్రజల పరిస్థితి అన్న వస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రం పోయినట్లుగా మారింది. దేశ ఆర్థిక పరిస్థితి పడిపోవడానికి కరోనా కారణం కాదు. ఎప్పటినుంచో దేశ ఆర్థిక పరిస్థితి పడిపోయింది. హైదరాబాద్ ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి దాదాపు లక్షన్నర కోట్లు. బెంగళూరు ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి రూ. 3 లక్షల కోట్లు. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం. మత కలహాలు పెట్టి హిజాబ్ పంచాయితీ పెట్టారు. ఇలాంటి ఆలోచనలు చేస్తే దేశం ఏమవుతుంది? హిజాబ్ లాంటి ఇష్యూలు ఉంటే దేశానికి పారిశ్రామికవేత్తలు వస్తారా? ఇలాంటి వివాదాలు దేశ యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయి. కేంద్ర తీరును అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలి. కొందరు దేశంలో విషభీజాలు నాటుతున్నారు.