ఢిల్లీకి సీఎం కేసీఆర్

ఢిల్లీకి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు ఆయన బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఢిల్లీ టూర్ లో కేంద్ర మంత్రులు, ప్రధానిని కలిసి ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాలు, కులగణన, విద్యుత్ చట్టాల రద్దుపై విజ్ఞప్తి చేస్తామని చెప్పారు సీఎం. ఇప్పటికే కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో సీఎం సతీమణి శోభకు వైద్య పరీక్షలు చేయనున్నారు. అందుకోసం రెండు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.