భద్రాచలం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్

భద్రాచలం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు ప్రాంతాలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు ఆయన నిన్న వరంగల్ చేరుకున్నారు. ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు సీఎం బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దు చేశారు. 

ఈ నేపథ్యంలో బాధిత ప్రజలను చేరుకోవడానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. ములుగు, ఏటూరు నాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగుతున్నది. కేసీఆర్ తో సహా ప్రయాణిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారుల బృందం భద్రాచలానికి చేరుకోనున్నారు. అక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు.