హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్(గిలాఫ్)ను సీఎం.. అజ్మీర్కు పంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ను సీఎం కేసీఆర్ ముందు ఉంచి, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమించాలని, కేసీఆర్ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థించారు.
ఈ ప్రార్థనల్లో హోంమంత్రి మహముద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫారూఖ్ హుస్సేన్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాజా ముజిబీద్దిన్, మైనార్టీ నేతలు ముఫ్తీ సయ్యిద్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్తో పాటు పలువురు పాల్గొన్నారు.