ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన మెడికల్ విద్యార్థుల అంశాన్ని అందులో ప్రస్తావించారు. రష్యా సైనిక చర్య కారణంగా ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థుల వైద్య విద్య కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచాలని కేసీఆర్ కోరారు. ఉక్రెయిన్ నుంచి దాదాపు 700 మంది మెడికల్ స్టూడెంట్లు తెలంగాణకు వచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించిన ఆయన.. వారందరి ఫీజులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా దయచేసి వీలైనంత తొందరగా అనుమతులిచ్చేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అభ్యర్థించారు.

For more news..

సరిస్కా టైగర్ రిజర్వ్లో కార్చిచ్చు

చర్చల్లో పురోగతి.. తగ్గిన క్రూడాయిల్ రేట్లు