రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్

ముస్లీంల పవిత్ర పండగ రంజాన్... ఏప్రిల్ 11వ తేదీ రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ముస్లీంలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.  ఈదుల్ ఫితర్ పురస్కరించుకుని హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. అక్కడ షబ్బీర్ అలీ, ఇతర ముస్లిం పెద్దలకు సీఎం పండుగ శుభాకాంక్షలు చెప్పారు సీఎం. వేడుకల్లో భాగంగా అందరితో కలిసి విందు ఆరగించారు సీఎం రేవంత్ రెడ్డి.
 
అనంతరం CM రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సాయంత్రం హస్తినలో AICC ముఖ్య నేతలతో భేటీకానున్నారు రేవంత్. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ సీట్లలో అభ్యర్థుల ఖరారుపై ఢిల్లీ పెద్దలతో డిస్కస్ చేయనున్నారు. మొత్తం 17 స్థానాలకు ఇప్పటివరకు 14 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది హైకమాండ్. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ లీడర్లతో రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది.