
హైదరాబాద్: కాంగ్రెస్ కు తొమ్మిది లేదా.. 13 ఎంపీ సీట్లు వస్తాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరేడు స్థానంలో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని చిట్ చాట్ లో తెలిపారు. మెదక్ లో బీజేపీ మూడోస్థానంలోకి పడిపోయిందని చెప్పారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం 20వేల మెజారిటీ ఉంటుందని చెప్పారు. బీజేపీకి తెలంగాణలో వేవ్ లేదని.. బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కోసం పనిచేశారని చెప్పారు.
కేంద్రంలో బీజేపీకి 220 సీట్లకంటే మించి రావన్నారు. తనను జాతీయస్టార్ క్యాంపెయినర్ గా పార్టీ నియమించిందని.. ఇతర రాష్ట్రాల్లో ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ ఏ పని అప్పగిస్తే అది చేస్తానన్నారు రేవంత్. రేపటి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టిపెడతానన్నారు. రైతు రుణమాఫీ, సమస్యలు, విద్యా సంవత్సరం మొదలు కానుండటంతో సన్నబియ్యం సరఫరా, పుస్తకాలు, యూనిఫాం పంపిణీపై సమీక్షిస్తానన్నారు సీఎం రేవంత్.