
ధరణిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ధరణి సమస్యల పరిష్కారం దిశగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై చర్చించిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని, సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం.ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని, అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.