ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం డిల్లీ వెళ్లనున్నారు. లోక్‌‌‌‌సభ అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే సీఈసీ మీటింగ్‌‌‌‌కు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, సీఈసీ మెంబర్ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారని పార్టీ నేతలు వెల్లడించారు. త్వరలో మరో 3 లేదా 4 పేర్లతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఏఐసీ సీ ప్రకటించనుందన్నారు.

కాగా, ఎంపీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఈసీ మీటింగ్ మూడోసారి సమావేశం అవుతోంది. ఈ నెల 7న తొలి మీటింగ్ జరగగా, 8న దేశ వ్యాప్తంగా 39 మంది ఎంపీ అభ్యర్థులతో జాబితాను రిలీజ్‌‌‌‌ చేసింది. ఇందులో తెలంగాణ నుంచి జహీరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం రెండోసారి మీటింగ్ జరగగా, అభ్యర్థులను ప్రకటించలేదు. బుధ వారం జరగనున్న మీటింగ్ తర్వాత దేశ వ్యాప్తంగా మరికొంత మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారు.