ఇయ్యాల ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ఇయ్యాల ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. పెండింగ్ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ పెద్దలతో ఆయన చర్చించనున్నట్టు సమాచారం. గురువారం రంజాన్ సందర్భంగా ముందుగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటికి రేవంత్ వెళ్లనున్నారు. అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నట్టు తెలిసింది. కాగా, రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను కాంగ్రెస్ ఇప్పటివరకు14 సీట్లకు అభ్యర్థు లను ప్రకటించింది. ఇంకా హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికలకు రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ఈ నెల18 నుంచి ప్రారంభం కానుండగా.. మే 13వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.