సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. గుండెపోటుతో మంగళవారం మృతి చెందిన రాజీవ్ రతన్ అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో రాయదుర్గం మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
రాజీవ్ రతన్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన తీవ్ర గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆయనే సారధ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డీజీగా, పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో పని చేశారు.