
రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు జమ చేస్తామన్నరేవంత్... 70 లక్షల 11 వేల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పారు. మొత్తం కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు ఆపడం లేదని... ఎవరెన్ని కుట్రలు చేసినా..ఎన్ని ధర్నాలు చేసినా ఇంకా పదేళ్ల తామే అధికారంలో ఉంటామన్నారు రవంత్.
వ్యవసాయం దండుగ కాదు..పండగని నిరూపిస్తున్నాం . గత 18 నెలల్లో రైతుల కోసం రూ లక్ష కోట్లు ఖర్చు చేశాం. వ్యవసాయంలో టెక్నాలజీ రావాల్సి ఉంది. రైతు వేదికల్లో రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి. రైతుల శ్రేయస్సు కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తోంది.
మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేశారు. గతంలో సీఎం సెక్రటేరియట్ కు వచ్చే వారు కాదు.సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ లతో కుట్రలు చేశారు. కానీ ఇపుడు అందరూ స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను సరిదిద్దుతున్నాం.
ఒకప్పుడు ఉద్యోగాలు,నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేశారు. ఇపుడు నోటిఫికేషన్లకు సమయం ఇవ్వాలని అంటున్నారు. కుటుంబంలో ఒక్కరు ఉద్యోగం,ఒక్కరు వ్యవసాయం, మరొకరు వ్యాపారం చేయాలని సూచించారు రేవంత్.