సీఎం రేవంత్ రెడ్డి కృషితో కంటోన్మెంట్ కు 303 కోట్లు

సీఎం రేవంత్ రెడ్డి కృషితో కంటోన్మెంట్ కు 303 కోట్లు

పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.303 కోట్లు కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారని కంటోన్మెంట్​ ఎమ్మెల్యే శ్రీగణేశ్​ అన్నారు. 

బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎలివేటెడ్​ కారిడార్ల వల్ల ప్రైవేట్ ఆస్తులు కోల్పోతున్న వ్యక్తులకు ఎలాంటి నష్టం జరుగకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ఎలివేటెడ్​ కారిడర్ల నిర్మాణంతో ఉత్తర తెలంగాణ అభివృద్ధి జరగడంతో పాటు కంటోన్మెంట్​నియోజకవర్గ స్వరూపమే మారిపోతుందన్నారు.