నీ అయ్య.. ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేది : సీఎం రేవంత్ రెడ్డి

నీ అయ్య.. ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేది : సీఎం రేవంత్ రెడ్డి

ఇంద్రవెల్లి సభలో బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు, ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వాళ్లను ఊర్లలో వేప చెట్టుకు కట్టి కోదండం వేసి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన వచ్చినోళ్లను గ్రామాల్లో తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం అని.. ప్రభుత్వాన్ని పడగొడతాం అంటూ ఎవరైనా మాట్లాడితే పళ్లు రాలకొట్టండని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 

లక్ష కోట్ల దోపిడీతో.. గాలికి కొట్టుకుపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదని.. ఇది ప్రజా ప్రభుత్వం అని.. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వం అన్నారాయన. ప్రభుత్వం కూలిపోతుందని భ్రమల్లో, కలలో కేసీఆర్ ఉన్నారని.. కేసీఆర్ ఖందాన్ మొత్తం వచ్చినా.. పండబెట్టి కొడతాం అంటూ హెచ్చరించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని.. ఎవడైనా చెప్పాడంటే మూతి పళ్లు రాలకొడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అక్రమ సంపాదనతో.. తన ఫాంహౌస్ కు సీఎం అవుతాడేమో  కానీ.. కేసీఆర్ ఈ జన్మలో ఇక ముఖ్యమంత్రి కాడని.. కనీసం మంత్రి కూడా కాడన్నారాయన.

ప్రజలకు కేసీఆర్ చేసిన పాపాలకు అనుభవించాల్సిందే అని.. అన్ని వర్గాలను నిట్టనిలువునా మోసం చేసి.. మళ్లీ సిగ్గు లేకుండా పదవి కావాలని కోరుకోవటం ఏంటని ప్రశ్నించారాయన. తెలంగాణలో ఎంపీలను ఢిల్లీలోని మోదీకి తాకట్టు పెట్టాడంటూ చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ గాలి కూడా కేసీఆర్ ను తాకదన్నారు. 

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన రేవంత్ రెడ్డి.. అదే స్థాయిలో రెచ్చిపోయి వార్నింగ్ ఇచ్చారు.

  • Beta
Beta feature