
యాదాద్రి వెలుగు : జూన్ 6న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై బడిబాటలో తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు.
జూన్ 7 నుంచి 10 వరకు ఇంటింటి ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్డీవో నాగిరెడ్డి, ఎస్సీ ఇరిగేషన్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.