రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
రిజర్వాయర్లలో సరిపడా నీరుందని, నిరంతర నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాగునీటి సమస్య రాకుండా పకడ్బంధీచర్యలు చేపట్టాలన్నారు. ఏప్రిల్, మే,జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. బోర్ వెల్స్, బావులను తాగునీటి అవసరాలకు ఉపయోగించాలని ఆదేశించారు. నీటి వృథాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు.