సీఎం ఉద్ధవ్ థాకరే బెదిరింపులకు దిగుతున్నారు

సీఎం ఉద్ధవ్ థాకరే బెదిరింపులకు దిగుతున్నారు

తమ కుటుంబాన్ని, తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ బెదిరిస్తోందన్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వ్యక్తిగత విమర్శలు, దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్  అర్నాబ్ గోస్వామి, సినీనటి కంగనా రనౌత్ ల అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని ఎప్పుడూ చెప్పలేదన్నారు ఫడ్నవిస్. అయితే వారి పట్ల మహా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మాత్రం తప్పుపడుతున్నామన్నారు. వీరి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కోర్టులు కూడా తప్పుపట్టాయన్నారు.

అంతకు ముందు థాకరే … బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది చేతకాని ప్రభుత్వంగా భావించవద్దని హెచ్చరించారు. మీరేమీ నీతిమంతులు కాదని… మిమ్మల్ని ఎలా సెట్ చేయాలో మాకు తెలుసని అన్నారు.