ఉప్పల్, వెలుగు: ఉప్పల్లోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్చేసిన వెజ్ బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. రామంతాపూర్కు చెందిన బాలు తన కూతురు కోసం స్విగ్గీలో ఆదివారం వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీ తింటున్న క్రమంలో బొద్దింక కన్పించడంతో బాధితుడు ఇదేంటని మాస్టర్ చెఫ్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు ఉప్పల్పీఎస్లో ఫిర్యాదు చేశాడు. మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ను తనిఖీ చేసి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
