నల్గొండ: జిల్లాలోని పెద్ద ఊర మండలం తుంగతుర్తిలో నిన్న శనివారం కుప్ప కూలిన ఎయిర్ క్రాఫ్ట్ శకలాలను ఏవియేషన్ అకాడమీకి తరలించారు పోలీసులు. ఎయిర్ క్రాఫ్ట్ ఎలా కూలిందన్నది తెలుసుకోవడానికి శకలాలు కీలకం కావడంతో డీజీసీఏ, ఏఏఐబీ అధికారులు తరలివచ్చారు. ల్యాబ్ లో పరీక్షల కోసం శకలాలను ఫ్లై టెక్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీకి తరలించారు. కూలిన ఎయిర్ క్రాఫ్ట్ శకలాలును క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది.. దారి తీసిన పరిస్థితులేమిటన్నది సమగ్ర దర్యాప్తు చేసి తేల్చుతామని డీజీసీఏ, ఏఏఐబీ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
థియేటర్లు సీజ్ చేయలేదు..అదంతా దుష్ప్రచారం