వనపర్తి జిల్లాలో స్కూళ్ల రిపేర్లు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లాలో స్కూళ్ల రిపేర్లు స్పీడప్​ చేయాలి : కలెక్టర్  ఆదర్శ్  సురభి

వనపర్తి, వెలుగు: మన ఊరు- మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా చేపట్టిన స్కూళ్ల రిపేర్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, టీడబ్ల్యూఐడీసీ, ఆర్అండ్ బీ ఇంజనీరింగ్  అధికారులతో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్​వాడీ సెంటర్లలో సౌలతులు కల్పించడంపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. మధ్యలోనే నిలిచిపోయిన మన ఊరు మనబడి పనులను కాంట్రాక్టర్లతో మాట్లాడి త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ఆ పనులకు నిధులు వెంటనే మంజూరు చేస్తున్నామని తెలిపారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పాఠశాలల రిపేర్లు మధ్యలో ఆగిపోయాయని, మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు వంటి పనులు పూర్తి చేయాలని, పనులు పూర్తి చేసి డబ్బులు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు వనపర్తి మండలం అంకూర్, పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను  కలెక్టర్  సందర్శించారు. భూ రికార్డులు, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఒకేసారి 3 నెలల బియ్యం ఇస్తున్న దృష్ట్యా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.