
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
దేవరకొండ (గుడిపల్లి), హాలియా, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం గుడిపల్లి మండలం కేశంనేనిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించని వారు త్వరగా మొదలు పెట్టాలన్నారు.
ఇండ్ల నిర్మాణంలో నాణ్యమైన సామగ్రిని ఉపయోగించాలని చెప్పారు. అనంతరం గనిపల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి సదస్సుకి దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి తో కలిసి దరఖాస్తులను పరిశీలించారు. అంతకుముందు గుర్రంపోడు మండలం జూనూతల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట వివిధ శాఖల అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామస్తులు ఉన్నారు.