
- కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి, యాదగిరిగుట్ట, వెలుగు : ప్రపంచ సుందరీమణులు రానున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. మిస్ వరల్డ్పోటీల్లో పాల్గొనే సుందరీమణులు ఈనెల 15న పోచంపల్లిలోని టెక్స్టెల్స్ఎగ్జిబిషన్, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ సుందరీమణులు పర్యటించే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, ఆయా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దాలన్నారు. యాదగిరిగుట్టను ఆర్చీలు, స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. చేనేత వస్త్ర సాంప్రదాయానికి వేదికగా నిలిచిన పోచంపల్లి సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టిల్లు అని, ఏ మాత్రం లోటు రాకుండా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు.
ముందుగా పోలీస్ అధికారులు మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించారు. అనంతరం కొండపైన జరుగుతున్న ఏర్పాట్లను ఎండోమెంట్ డైరెక్టర్, ఆలయ ఈవో వెంకటరావు, డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ తో కలిసి పరిశీలించారు. ప్రధానాలయంలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, టూరిజం కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఉపేందర్ రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.