గద్వాల జిల్లాలో వన మహోత్సవం టార్గెట్ కంప్లీట్ చేయాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల జిల్లాలో వన మహోత్సవం టార్గెట్  కంప్లీట్  చేయాలి : కలెక్టర్  సంతోష్

గద్వాల, వెలుగు: వన మహోత్సవం టార్గెట్లను కంప్లీట్  చేయాలని గద్వాల కలెక్టర్  సంతోష్  ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో వన మహోత్సవంపై ఆఫీసర్లతో మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాకు 15 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్  పెట్టారని, వివిధ శాఖలకు కేటాయించిన టార్గెట్లను కంప్లీట్  చేయాలన్నారు. ఇప్పటికే నర్సరీల్లో అవసరమైన మొక్కలు రెడీగా ఉన్నాయని తెలిరు. అడిషనల్  కలెక్టర్  నర్సింగరావు, డీపీవో నాగేంద్రం, ఎఫ్ఆర్వో పర్వేజ్ అహ్మద్, ఇరిగేషన్  ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇన్​చార్జి సీపీవోగా యోగానంద్..

ఇన్​చార్జి చీఫ్  ప్లానింగ్  ఆఫీసర్ గా యోగానంద్  బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ సీపీవో లక్ష్మణ్  రిటైర్​ కావడంతో, ఆయన స్థానంలో నారాయణపేట సీపీవోకు అదనపు బాధ్యతలు అప్పగించారు.