పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి : కలెక్టర్ వల్లూరు క్రాంతి

పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి :  కలెక్టర్  వల్లూరు క్రాంతి

గద్వాల, వెలుగు : యువత పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని కలెక్టర్  వల్లూరు క్రాంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో రిటైర్డ్  తెలుగు టీచర్ రామ్మోహన్  రచించిన ‘అమ్మకు జోహార్లు’ పుస్తకాన్ని కలెక్టర్  ఆవిష్కరించారు. 

సమాజ చైతన్యం కోసం అమ్మ ప్రాధాన్యతను తెలియజేస్తూ పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. ఇలాంటి పుస్తకాలకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు. మోహన్ రావు, రామన్ గౌడ్, బాలకిషన్  పాల్గొన్నారు.