
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జోరుగా చేరికలు జరుగుతున్నాయి. ఇటీవల సినీ నటి జయసుధ వైసీపీలో చేరగా..ఇవాళ సినీ నటుడు అలీ అదేపార్టీలో చేరాడు. సోమవారం ఆ పార్టీ అధినేత జగన్ అలీని ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన అలీ..జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ‘1999లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేశాను. మళ్లీ 2019లో ప్రచారం చేసి జగన్ సీఎం చేయాలనుకుంటున్నాను. ఆయన ఇచ్చిన మాటను తప్పరు. ప్రచారం చేసి మేజార్టీతో గెలిపించు. తర్వాత నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.
దివంగత మహానేత వైఎస్సార్ పాదయాత్రకు ఎంతటి ఆదరణ వచ్చిందో.. ఇప్పుడు జగన్ పాదయాత్ర తర్వాత కూడా అంతే ఆదరణ లభిస్తోంది. జగన్ సీఎం కావాలిన చాలా మంది కోరుకుంటున్నారు. గతంలో నేను ఆయనను కలవడం జరిగింది. అప్పుడు ఆయన నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అని తెలిపాడు అలీ. అయితే.. జనసేన అధినేత పవన్ కు అలీ బెస్ట్ ఫ్రెండ్..అలాంటిదీ అలీ ఇప్పుడు వైసీపీలో చేరడంతో..ఈ టాపిక్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది.