ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డ TRSనేతలపై ఈసీకి ఫిర్యాదు

ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డ TRSనేతలపై ఈసీకి ఫిర్యాదు

అధికార TRS పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కరీంనగర్ మాజీ మేయర్, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్‌.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న వారిని ప్రలోభపెట్టే విధంగా క్యాంపులకు తరలించారన్నారు. ప్రత్యేక బస్సుల్లో నేరుగా పోలింగ్ బూత్ కు ఓటర్లను తీసుకొచ్చారన్నారు.  మంత్రి గంగుల కమలాకర్ సుమారు 100 మందితో TRS పార్టీ అనుకూల నినాదాలు చేస్తూ ర్యాలీగా పోలింగ్ బూతులో కి వెళ్లినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించారన్నారు. పోలింగ్ బూత్ లోనే గంగుల  రెండు గంటల పాటు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కరోనా  నిబంధనలు పాటించకుండా  మాస్కులు లేకుండా పోలింగ్ బూత్ లోకి వచ్చారన్నారు. వీటిపై  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు సర్ధార్ రవీందర్ సింగ్.