హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని కేసీఆర్ కొనియాడారు.
Hon'ble CM stated that #CentralVista is a nationally important project and is long overdue adding that the existing government infrastructure in the capital is inadequate and is also associated with India's colonial past.
— Telangana CMO (@TelanganaCMO) December 9, 2020
ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేదని, అలాగే అవి వలస పాలనకు గుర్తుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్ఠకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి’’ అని కేసీఆర్ ఆకాంక్షించారు.