హైదరాబాద్, వెలుగు: వ్యవసాయానికి ఉచిత కరెంట్రద్దు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానమని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం లేదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ఎల్పీలో మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు 24 గంటల కరెంట్ఇవ్వొద్దు అనే చర్చ కాంగ్రెస్పార్టీ అసలు ఎందుకు తీసుకువచ్చిందో చెప్పాలన్నారు. వైఎస్సార్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ఇస్తామని ఎక్కడ అన్నారో నిరూపించాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్గఢ్నుంచి ఇతర రాష్ట్రాలకు కరెంట్అమ్ముతున్నారే తప్ప రైతులకు మాత్రం ఉచితంగా ఇవ్వడం లేదన్నారు. ఉచిత కరెంట్వద్దు అని రేవంత్ అంటుంటే ఆయన వెంట ఉన్న నేతలు చప్పట్లు కొడుతున్నారని, దీన్ని ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కో నాయకుడికి ఒక్కో విధానం ఉంటుందా అని మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. రైతులు సంతోషంగా ఉండటం ఆ పార్టీకి ఇష్టం లేనట్టు ఉందన్నారు.
తెలంగాణను పోరాడి సాధించుకున్నామే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సబ్స్టేషన్ దగ్గరికి వెళ్లి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ కరెంట్ను పట్టుకొని షాక్కు గురైందన్నారు. ఉచిత కరెంట్పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు.